కాగజ్ నగర్ పట్టణంలోని ఆర్టీసి బస్ స్టాండ్ లో మంగళవారం స్పర్శ ఫౌండేషన్, సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం వారి సహకారంతో చలివేంద్రలు ఏర్పాటు చేయడం జరిగింది. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని మిల్లు ప్రతినిధులు తెలిపారు. ప్రజలు అందరూ తప్పకుండా ఉపయోగించుకోవాలని అన్నారు. నాగేశ్వరరావు, రీణ బివాల్, తుమ్మ రమేష్, జమషద్ ఆలి తదితరులున్నారు.