ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్కు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్లో ఉండగా, ఈ రోజు ఆయన కస్టడీని కోర్టు 14 రోజులు పొడిగించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. మే 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ను కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు.