గుండె పోటుతో రైతు మృతి
బయ్యారం మండలం గంధంపల్లి కొత్తపేట పంచాయతి పరిధిలో నివాసం ఉంటున్న నాయిని గురువయ్య కుమారుడు నాయిని వెంకట్రావు మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న వెంకట్రావు గిట్టుబాటు ధర లేక తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక మానసిక ఇబ్బందులతో వెంకట్రావు గుండెపోటుతో మరణించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు భార్య ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.