వేడుకగా తలంబ్రాల తయారీ

70చూసినవారు
ప్రతేడాది ఫాల్గుణ పౌర్ణమి రోజున పసుపు కొమ్ములను దంచి, తలంబ్రాల తయారీతో భద్రాచలం రామయ్య పెళ్లి పనులకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. సోమవారం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ పల్లకీ సేవగా స్వామివారి ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారం వద్దకు తీసుకొచ్చి ఆశీనులు చేశారు. అర్చకులు స్వామివారికి, రోళ్లు, రోకళ్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈఓ రమాదేవి తొలుత పసుపు కొమ్ములు దంచి పెళ్లి పనులు ప్రారంభించారు.

ట్యాగ్స్ :