మావోయిస్టులకు సహకరించవద్దు

54చూసినవారు
తమ స్వార్ధ ప్రయోజనాల కోసం, ఉనికి కోసం ఆదివాసి ప్రాంత అభివృద్ధికి నిరోధకులుగా మారిన మావోయిస్టులకు సహకరించవద్దని దుమ్ముగూడెం సీఐ అశోక్ గ్రామస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. దుమ్ముగూడెం మండలం ముల్కనపల్లి వలస గుత్తికోయ గ్రామంలో శనివారం పోలీసులు కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో భాగంగా అనుమానిత వ్యక్తుల కోసం ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్