కొత్తగూడెం: విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

79చూసినవారు
దసరా సెలవుల్లో ఇచ్చిన హోంవర్కును పూర్తి చేయలేదనే కారణంతో కొత్తగూడెం పట్టణంలో ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు గణేష్ టెంపుల్ ఏరియాకు చెందిన పదేళ్ల బాలుడిని మంగళవారం చితకబాదాడు. ఒంటిపై వాతలు తేలడంతో తల్లిదండ్రులు బుధవారం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఉపాధ్యాయుణ్ని పిలిపించి మాట్లాడారు. తల్లిదండ్రులకు పలువురు ఉపాధ్యాయులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

సంబంధిత పోస్ట్