నీటి విడుదలపై KRMB ఉత్తర్వులు జారీ

72చూసినవారు
నీటి విడుదలపై KRMB ఉత్తర్వులు జారీ
ఎండాకాలంలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు(KRMB) నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జునసాగర్‌లో 500 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవాలని నిర్ణయించింది. 500 అడుగుల వరకు సాగర్‌లో 14.195 టీఎంసీల వరకు నీటి లభ్యత ఉందని తెలిపింది. అందులో ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయించారు. మిగిలిన నీరు హైదరాబాద్‌ సహా ఇతర జిల్లాల తాగునీటి అవసరాల కోసం వినియోగానికి తెలంగాణకు అనుమతిచ్చారు.