జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భారత వైమానిక దళం కాన్వాయ్పై శనివారం రాత్రి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వాయుసేనకు చెందిన ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ ఐదుగురు సైనికుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఇండియన్ ఆర్మీ గత రాత్రి నుంచి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నది.