ఒకే వీధిలో నివసిస్తున్న తండ్రీకొడుకులు వేర్వేరు రాష్ట్రాల పరిధిలో నివసిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటిని నిర్మించుకున్నారు. విభజన తర్వాత తండ్రి శ్రీనివాస్ ఇల్లు ఏపీలోని అల్లూరి జిల్లా అరకు లోక్సభ పరిధిలోకి వెళ్లింది. కొడుకు జానకీరామ్ తెలంగాణలోని మహబూబాబాద్ లోక్సభ పరిధిలోకి వెళ్లింది.