రైతులపై లాఠీఛార్జ్‌.. అదనపు బోనస్‌: నిరంజన్‌ రెడ్డి

70చూసినవారు
రైతులపై లాఠీఛార్జ్‌.. అదనపు బోనస్‌: నిరంజన్‌ రెడ్డి
రేవంత్‌ ప్రభుత్వం ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోందని BRS నేత నిరంజన్‌ రెడ్డి అన్నారు. రేవంత్‌ ప్రభుత్వానికి హామీల అమలుపై చిత్తశుద్ది లేదన్నారు. ప్రభుత్వం ఎలా వెళ్తోందో ప్రజలకు అర్థమైందని.. గత ప్రభుత్వాన్ని, KCRను చిన్నగా చూపే ప్రయత్నం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ చెప్పిన బోనస్ అనేది ఒక బోగస్ అని, రైతులపై లాఠీఛార్జ్‌.. అదనపు బోనస్‌ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్