దసరాకు ప్రతిజ్ఞ చేద్దాం.. వాహనదారులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి (వీడియో)

71చూసినవారు
TG: వాహనదారులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక సూచనలు చేశారు. సగటున దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని, తెలంగాణలో సగటున రోజుకు 20 మంది మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం వీడియో సందేశం ద్వారా తెలిపారు. దసరా పండుగ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాం, హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తాం అని ప్రతిజ్ఞ చేయాలన్నారు. రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్