సోషల్ మీడియాలో తాజాగా ఓ యూట్యూబ్ వీడియో బాగా ట్రెండ్ అవుతోంది. ఫారెస్ట్ అధికారులు అడవిలో జంతువుల కోసం నీటి కుంటలు ఏర్పాటు చేశారు. అయితే, ఇక్కడ నీటి కోసం ఓ ఏనుగు వచ్చింది. అప్పటికే ఆ సంపు పక్కన ఉన్న సింహం.. ఏనుగు రాకను గమనించి నీటి సంపు పక్కన నక్కింది. ఏనుగు సైతం ఆ సింహాన్ని గమనించి భయం భయంతోనే నీటిని తాగేసింది. చివరగా తన తొండంతో నీటిని పీల్చుకున్న ఏనుగు.. ఆ నీటిని సింహం మీదకు చల్లింది. దాంతో సింహం అక్కడి నుంచి పరుగులు తీసింది.