రాజస్థాన్ లోని కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్లోని రేవాకు చెందిన బగీషా తివారీ(18) అనే యువతి తన తల్లి, సోదరుడితో కలిసి జవహర్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. అక్కడే కోచింగ్ తీసుకుంటూ నీట్ కు సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో నీట్ యూజీ ప్రవేశ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఏడాదిలో కోటాలో ఇది 11వ ఆత్మహత్య కావడం గమనార్హం. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.