ఢిల్లీ మహిళా కమిషన్లోని 223 మంది ఉద్యోగులను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తొలగించారు. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు వీరిని నియమించినట్లు తెలుస్తోంది. ప్యానల్కు సరిపడా 40 మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండానే 223 పోస్టులు సృష్టించారని, వారిని నియమించే అధికారం కమిషన్కు లేదని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఉత్తర్వుల్లో పేర్కొంది.