గుజరాత్లోని రాజ్కోట్లో టీఆర్పీ గేమింగ్ జోన్లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 32కు చేరింది. డెడ్ బాడీలు పూర్తిగా కాలిపోవడంతో డీఎన్ఏ టెస్టుల ద్వారా వాటిని కుటుంబీకులకు అప్పగిస్తున్నారు. గేమ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్, ఓనర్ యువరాజ్ సోలంకీతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. 72 గంటల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.