పన్నెండేళ్లకోసారి జరిగే మహా కుంభమేళాకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సిద్ధమవుతోంది. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా భక్తులు వస్తారని యోగి ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ క్రమంలో దీని కోసం రూ.7,500 కోట్లు ఖర్చు చేసి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భద్రత కోసం అండర్ వాటర్ జలాంతర డ్రోన్లను వినియోగించనుంది.