జార్ఖండ్లోని రామ్గఢ్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన 65 ఏళ్ల తల్లిని ఇంట్లో ఉంచి తాళం వేసుకుని భార్య, పిల్లలు, అత్తమామలతో కలిసి మహాకుంభమేళాకు వెళ్లాడు. ఇంట్లో ఉన్న బందీగా ఉన్న వృద్ధురాలు తిండిలేక ఆకలితో అలమటిస్తూ.. ఏడుస్తుండడంతో పక్కింటి వారు చూసి ఆమె కుమార్తెకు సమాచారం ఇచ్చారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇంటి తాళం పగులగొట్టి వృద్ధురాలిని బయటకు తీసుకొచ్చారు.