హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళలు చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చిన లేదా పుట్టిన తర్వాత చనిపోయిన అలాంటి తల్లులకు మాతృత్వ సెలవులను 60 రోజుల పాటు ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటించింది. మెటర్నిటీ లీవ్ నిబంధనలే ఈ సెలవులకు కూడా వర్తిస్తాయని తెలిపింది.