ధర్నా నిర్వహించిన పాల రైతులు

60చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన పలువురు రైతులు బుధవారం హైదరాబాద్ లాలాపేట విజయ డైరీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 15 రోజులకు ఒకసారి బిల్లులు ఖచ్చితంగా చెల్లించాలని, పాత బకాయిలు విడుదల చేయాలని, ఐదు రూపాయల ప్రత్యేక ప్రోత్సాహం అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. డిమాండ్లు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో ఉధృతంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్