మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ గురువారం దేవరకద్ర నియోజకవర్గం కేంద్రానికి రాగా ఆమెకు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. దేవరకద్రలోని వ్యాపారస్తులు రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణంకై ఎంపీకి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ పార్లమెంట్ కన్వీనర్ పవన్ కుమార్ రెడ్డి, జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఎగ్గని నరసింహులు, మండల అధ్యక్షుడు కృష్ణంరాజు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.