మల్దకల్ 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రంలో విద్యుత్తు సామగ్రి మార్చుటకు పనులు చేపడుతున్నట్లు ఏడీఏ గోవిందు, ఏఈ దుర్గాప్రసాద్ తెలిపారు. మంగళవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు మల్దకల్, పెద్దోడ్డి శేషంపల్లె, కుర్తిరావులచెర్వు, నీలిపల్లి గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.