సికింద్రాబాద్‌-విశాఖ మధ్య వందే భారత్‌ రైలు ప్రారంభం

2557చూసినవారు
సికింద్రాబాద్‌-విశాఖ మధ్య వందే భారత్‌ రైలు ప్రారంభం
సికింద్రాబాద్‌-విశాఖపట్నం మార్గంలో వందేభారత్ రైలును ఇవాళ ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విశాఖ- సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తుండగా మంగళవారం నుంచి ఇదే మార్గంలో కొత్త రైలు పట్టాలెక్కనుంది. తాజాగా ప్రారంభించిన కొత్త రైలు ఉ.5.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మ.1.50కి విశాఖ చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మ.2.35కి బయలుదేరి రా.11.20కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. రేపటి నుంచి సేవలు ప్రారంభమవుతాయి.

సంబంధిత పోస్ట్