ఉగాది పర్వదిన వేడుకలను పురస్కరించుకొని మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని సంకాపురం గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలను బీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్త పల్లయ్య ప్రారంభించారు. క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ ఈశ్వర్, నిర్వాహకులు నాగరాజు, నాయకులు కృష్ణ, తిమ్మారెడ్డి, గోపాల్, భాష, అన్నమయ్య తదితరులు పాల్గొన్నారు.