కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ నాలుగో రోజు పర్యటిస్తున్నారు. స్థానిక ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం యు.కొత్తపల్లి మండలం పొన్నాడలో బషీర్ బీబీ దర్గాకు పవన్ వెళ్లనున్నారు. ఉప్పాడ కొత్తపల్లిలో మహిళలతో సమావేశం కానున్నారు.