lగొర్రెల కోసం కురువలు కట్టిన డీడీలను వడ్డీతో కలిపి చెల్లించాలని బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కురువ, యాదవ బంధువుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ఆమె మాట్లాడుతూ. రామరాజ్యం రావాలన్నా, ధర్మం బతకాలన్నా మరోసారి మోదీ ప్రధాని కావాలని ఆశాభావం వ్యక్తంచేశారు. అనంతరం యాదవులు తమ సంపూర్ణ మద్దతు అరుణకేనని ప్రకటించారు.