ప్రియాంకా గాంధీ పర్యటన వాయిదా

58చూసినవారు
ప్రియాంకా గాంధీ పర్యటన వాయిదా
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఎన్నికల నిమిత్తం పర్యటన వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 10న తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. కాగా, ఆమె ఈనెల 11న వస్తారని, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరోజున ఉదయం కామారెడ్డి సభలో పాల్గొంటారని తెలిపాయి. అనంతరం కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మణికొండలో జరిగే రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. మరోవైపు AICC చీఫ్ ఖర్గే ఈనెల 10న రాష్ట్రంలో పర్యటించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్