నేడు నారాయణపేటకు మోదీ.. మక్తల్ కు రేవంత్

53చూసినవారు
నేడు నారాయణపేటకు మోదీ.. మక్తల్ కు రేవంత్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. డీకే అరుణకు మద్దతుగా నారాయణపేటలో మేదీ, అదే జిల్లా మక్తల్ లో చల్లా వంశీచంద్ రెడ్డి కోసం రేవంత్ ప్రచారం చేయనున్నారు. ఇద్దరి సభలు ఒకే సమయంలో సభలు ఉండటంతో అందరి చూపు నారాయణపేటపై పడింది. పాలమూరులో అగ్రనేతల పర్యటన అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. సీఎం సొంత జిల్లా కావడంతో మోదీ చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.