గుడిపల్లి రిజర్వాయర్ నుంచి నీటి విడుదల

62చూసినవారు
గుడిపల్లి రిజర్వాయర్ నుంచి బుధవారం కల్వకుర్తి ఎస్ఐఎస్ ఆయకట్టుకు నీటిని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విడుదల చేశారు. మంత్రి మాట్లాడుతూ. వ్యవసాయ సాగుకు నీళ్లు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, మెఘారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్