108 అంబులెన్స్ లో ప్రసవం

3337చూసినవారు
108 అంబులెన్స్ లో ప్రసవం
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం అవుసలోనిపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే గర్భిణి సోమవారం రాత్రి 108 అంబులెన్స్ లో ప్రసవించిందని టెక్నీషియన్ రాములు తెలిపారు. కాగా రాజేశ్వరికు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో గ్రామానికి చేరుకుని గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా పెద్ద జట్రం గ్రామం దగ్గర మగ బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. తల్లి కుమారుడు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్