మక్తల్ నుండి 20న బిజెపి బస్సు యాత్ర ప్రారంభం

1552చూసినవారు
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణ మండల కేంద్రం నుండి ఈనెల 20న బిజెపి బస్సు యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మక్తల్ పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 10 సంవత్సరాలలో బిజెపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు బస్సు యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్