శివనామ స్మరణతో మార్మోగిన సామాన్ పల్లి

545చూసినవారు
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని సామాన్ పల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన మహా శివ పూజతో గ్రామం మొత్తం శివనామస్మరణతో మార్మోగింది. ఉదయం ఎల్లమ్మ గుడి నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు కలశ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహా పడిపూజ జ్యోతిర్లింగాల పూజ, మహా మంగళహారతి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కనకాభిషేకం డబ్బులు వేలం వేయగా ఎర్సన్ తిప్పన్న 50 వేలకు దక్కించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్