నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో బుధవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఇటీవల ఒక వర్గానికి చెందిన జయంతి సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపుపై మరో మూడు వర్గాలకు చెందిన యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపడతామని ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.