లోక సభ ఎన్నికలలో భాగంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ప్రచార సభలో మంగళవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజీనపల్లి మండలంలో సమావేశం కోసం ఏర్పాటు చేసిన టెంట్ కూలిపోయింది. ఆ సమయంలో టెంటు కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. టెంట్ నిర్వహణ లోపం కారణంగా ఇలా జరిగిందని నాయకులు తెలిపారు.