జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు అందింది. పిఠాపురంలో జరిగిన నామినేషన్ ర్యాలీలో పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని వినియోగించారంటూ నాగార్జున రెడ్డి అనే జర్నలిస్టు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని వినియోగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద 100 మీటర్ల నిబంధనను కూటమి సభ్యులు ఉల్లంఘించారని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి.