దారుణం.. ఆడపిల్లలు పుట్టారని వేలివేత
మహబూబ్ నగర్ జిల్లాలో ఆడపిల్లలు పుట్టారని వివాహితను ఇంటి నుంచి గెంటేసిన ఘటన జరిగింది. నవాబ్ పేట మండలం కొండాపూర్ కు చెందిన శ్రీశైల, రమేష్ 2015లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారికి నలుగురు ఆడపిల్లలే పుట్టడంతో రెండేళ్లుగా భర్త, అత్తమామ నుంచి శ్రీశైలకు వేధింపులు ఎక్కువయ్యాయి. మా కొడుక్కి రెండో పెళ్లి చేస్తాం నువ్వు ఇంటి నుంచి వెళ్లిపోవాలంటూ సోమవారం ఆమెను గెంటేశారు. దిక్కుతోచని స్థితిలో ఆమె పోలీసులను ఆశ్రయించింది.