ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి: సిపిఎం

83చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్, తిరుమల కాలనీలలో సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ. మే 13 న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమి కాంగ్రెస్ నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి మల్లు రవికి హస్తం గుర్తుపై ఓట్లు వేసి వేయించి గెలిపించాలని పిలుపునిచ్చారు. మతోన్మద, కార్పొరేట్ అనుకూల బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్