ఫెమా ఉల్లంఘన కేసుకు సంబంధించి ఈడీ జారీ చేసిన సమన్లపై టీఎంసీ ఎంపీ, ఆ పార్టీ కృష్ణానగర్ అభ్యర్ధి మహువ మొయిత్ర మరోసారి స్పందించారు. కాషాయ పాలకులు వెంటపడిన ప్రతిసారీ తనకు వచ్చే ఓట్లు పెరుగుతున్నాయన్నారు. ఈడీ తనకు జారీ చేసిన సమన్లను ఆమె సీరియస్గా తీసుకోలేదన్నారు. ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున తాను ఈడీ విచారణకు హాజరు కాలేనని మహువ మొయిత్ర తేల్చిచెప్పారు. ఈడీ పని ఈడీదైతే తన పని తాను చేసుకుపోతానని ఆమె పేర్కొన్నారు.