యూపీలోని కాన్పూర్ జూ పార్కులో అధికారులు ‘కాన్పూర్ దర్శన్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు.. ఇక్కడి జంతువులపై ప్రత్యేకంగా రీల్స్ చేయాలని కోరారు. వీటిలో అత్యధిక వ్యూస్ వచ్చిన వారికి బహుమతులను అందజేయనున్నట్లు వెల్లడించారు. అత్యధికంగా లైక్ చేసిన రీల్కు రూ.5 వేలు, ఆ తరువాత ఉన్న రీల్కు రూ.3 వేలు అందజేయనున్నట్లు తెలిపారు.