యూపీలోని షాజహాన్పూర్లో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. తన పికప్ వ్యాన్ చోరీకి గురైందని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. పోలీసులు పట్టించుకోకపోగా, అవమానించారని వాపోయాడు. దీంతో ఎస్పీ కార్యాలయానికి చేరుకుని, అందరి ముందే నిప్పంటించుకున్నాడు. తన తండ్రి మంటల్లో కాలిపోతుండగా, పిల్లవాడు రోదించిన తీరు అందరినీ కలిచి వేసింది. ప్రస్తుతం బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉంది.