స్నేహితులతో మాట్లాడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి (వీడియో)

61చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో అక్టోబర్ 20 న జరిగిన ఓ షాకింగ్ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ప్రకాష్ సింగ్ బఘెల్ (31) అనే వ్యక్తి నలుగురు స్నేహితులతో కలిసి సిర్మౌర్ కూడలిలో ఉన్న ఓ దుకాణంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రకాష్ ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడు. అతడి స్నేహితులు భయపడి ఆసుపత్రికి తరలించగా.. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ వీడియో వైరల్‌గా మారింది

సంబంధిత పోస్ట్