విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేసిన అదనపు కలెక్టర్

70చూసినవారు
విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేసిన అదనపు కలెక్టర్
బెల్లంపల్లి పట్టణంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో అదనపు కలెక్టర సబావత్‌ మోతిలాల్‌ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేసి సంబంధిత భోజనం నిర్వాహకులకు పలు ఆదేశాలు జారీ చేశారు. సకాలంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారాన్ని అందించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్