ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం

70చూసినవారు
బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాత కాడపాక మహేందర్ సహకారంతో ఆస్పత్రిలోని గర్భిణీలు, బాలింతలు, బాలలు, రోగులు, డయాలసిస్ రోగులకు, అన్నార్తులు, ఆసుపత్రి సిబ్బందికి భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో బాయిజమ్మ సేవా ట్రస్ట్ సభ్యులు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్