ఉచిత ఇసుకపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

60చూసినవారు
ఉచిత ఇసుకపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ఉచిత ఇసుకపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రీచ్‌ల నుంచి ట్రాక్టర్లతో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక అవసరాలకు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ఇసుక తీసుకెళ్లవచ్చని పేర్కొంది. గతంలో ఎడ్ల బండ్లకే అనుమతి ఉండగా, తాజాగా ట్రాక్టర్లతో తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. పలుచోట్ల పోలీసులు ట్రాక్టర్ యజమానులపై కేసులు నమోదు చేస్తుండటంతో ప్రభుత్వం తాజాాగా జీఓ విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్