ఉగ్రవాదులను గుర్తించేందుకు భారీ ఆపరేషన్‌

56చూసినవారు
ఉగ్రవాదులను గుర్తించేందుకు భారీ ఆపరేషన్‌
జమ్ముకశ్మీర్ పూంచ్‌ జిల్లాలోని శశిధర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనా స్థలానికి ఉన్నతాధికారులు వెంటనే అదనపు బలగాలను తరలించారు. సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయిన ఉగ్రవాదులను గుర్తించేందుకు భారీ ఆపరేషన్‌ ప్రారంభించారు. గత ఏడాది సైన్యంపై వరుస ఉగ్రదాడులు జరిగిన ఈ ప్రాంతంలో ఈ ఏడాది ఇదే మొదటి అతిపెద్ద దాడి. ఇదిలా ఉండగా ఆరో విడతలో భాగంగా అక్కడ మే 25న ఇక్కడ పోలింగ్‌ జరగనుంది.

సంబంధిత పోస్ట్