జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలోని శశిధర్ ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనా స్థలానికి ఉన్నతాధికారులు వెంటనే అదనపు బలగాలను తరలించారు. సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయిన ఉగ్రవాదులను గుర్తించేందుకు భారీ ఆపరేషన్ ప్రారంభించారు. గత ఏడాది సైన్యంపై వరుస ఉగ్రదాడులు జరిగిన ఈ ప్రాంతంలో ఈ ఏడాది ఇదే మొదటి అతిపెద్ద దాడి. ఇదిలా ఉండగా ఆరో విడతలో భాగంగా అక్కడ మే 25న ఇక్కడ పోలింగ్ జరగనుంది.