బాలడిని హింసించిన చికెన్ సెంటర్ యజమాని

5328చూసినవారు
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో దారుణం జరిగింది. వెంకట్రావుపేట్ గ్రామంలో ఓ చికెన్ సెంటర్ యజమాని దాష్టీకం బయటపడింది. తన బైక్ ను తగలబెట్టాడని షాపులో పనిచేసే 16 ఏళ్ల బాలుడిపై యజమాని సాబేర్ దారుణంగా దాడి చేశాడు. సలసల మరిగే వేడి నీటిని ఒంటిపై పోసి హింసించాడు. సదరు యజమానిపై బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్