కరోనాతో పురుషులకే ఎక్కువ హాని

3269చూసినవారు
కరోనాతో పురుషులకే ఎక్కువ హాని
కరోనా మహమ్మారితో మహిళల కంటే పురుషులకే ఎక్కువ ప్రాణహాని ఉందని పరిశోధనలో తేలింది. అమెరికాలోని హ్యాకెన్ శాక్ మెరిడియన్ వైద్య పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. పురుషుల ఊపిరితిత్తులపై వైరస్ నేరుగా దాడి చేసి మరణాలకు కారణం అవుతోందని తెలిపారు. మహిళల్లో అయితే కొవ్వు కణాలపై దాడి చేస్తుందని, దీంతో ఊపిరితిత్తులకు పెద్దగా చేరలేకపోతుందని తెలిపారు.