మియామి ఓపెన్ టైటిల్ బోపన్న జోడీదే

71చూసినవారు
మియామి ఓపెన్ టైటిల్ బోపన్న జోడీదే
భారత సీనియర్ టెన్నిస్ డబుల్స్ ప్లేయర్ రోహన్ బోపన్న అదరగొట్టాడు. అమెరికాలో జరుగుతున్న మియామి ఓపెన్ టోర్నీలో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. శనివారం అర్థరాత్రి జరిగిన ఫైనల్‌లో బోపన్న జోడీ 6-3 (3-7), 6-3, 10-6 తేడాతో ఇవాన్ డోడిగ్ (క్రోయేషియా)- ఆస్టిన్ క్రాజిసెక్ (అమెరికా) జోడీని చిత్తు చేసింది. దీంతో బోపన్న జోడీ మియామి ఓపెన్ టైటిల్‌ను సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్