రాజస్థాన్‌లో కూలిన మిగ్-29 యుద్ధ విమానం (వీడియో)

1538చూసినవారు
రాజస్థాన్‌లోని బర్మేర్ సమీపంలో వాయుసేనకు చెందిన మిగ్-29 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. జెట్‌‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. వైమానిక దళానికి యుద్ధ విమానాల పైలట్లకు రాత్రివేళ రోజువారీ శిక్షణలో భాగంగా మిగ్-29ను నడుపుతుండగా సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే పైలట్ కిందికి దూకగా, విమానం క్షణాల్లో తగలబడిపోయింది.

సంబంధిత పోస్ట్