బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషీయల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపర్చనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. మార్చి 15న ఆమెను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు బెయిల్ రావడంతో కవితకు కూడా బెయిల్ వస్తుందని అంతా భావిస్తున్నారు.