దశాబ్దాలుగా మూతపడిన కోలారు బంగారు గనుల్లో (KGF) కార్యాచరణను పునఃప్రారంభించటంపై కర్ణాటక సర్కారు దృష్టిసారించింది. కోలారు, బంగారుపేటె, బంగారుదిన్ని పరిసరాల్లో కనీసం 5,213 హెక్టార్ల గనుల్లో తవ్వకాలు చేపట్టాలని మంత్రివర్గం తీర్మానించింది. ఈ తవ్వకాల బాధ్యతను భారత్ గోల్డ్మైన్ లిమిటెడ్ (BGML)కు ఇవ్వాలని, రాష్ట్రానికి ఈ సంస్థ నుంచి రావాల్సిన రాయల్టీ రూ.75.24 కోట్లను ఇప్పించాలని కేంద్రానికి సిఫార్సు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.